
కరీంనగర్: బ్లాక్ లో రెమిడిసివర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నలుగురుని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లోని కిసాన్ నగర్, ప్రవిష్టా అపార్ట్మెంట్ లో కొన్ని రోజులుగా గుట్టు ప్పుడు కాకుండా బ్లాక్ లో రెమిడిసివర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ప్రవిష్టా అపార్ట్ మెంట్ లో సోదాలు చేసి, రెమిడిసివర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ దందా చేస్తున్న నలుగురుని అరెస్టు చేశామని కరీంనగర్ పోలీసులు తెలిపారు. సైదాపూర్ కు చెందిన లావుడ్య అంజనీ కుమార్, కొత్తపల్లికి చెందిన చోపరి గోపిచంద్, చొప్పదండికి చెందిన గజ్జెల శ్యామ్ కుమార్, కరీంనగర్ లోని సావ్రన్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన గంటల యుగంధర్ లను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు. వీళ్లంతా వేర్వేరు ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నిషియన్లుగా, ఇతర హెల్త్ వర్కర్లుగా పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరి నుంచి ఏడూ రెమెడీసీవర్ ఇంజెక్షన్లు, రూ. 4500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.