టెన్త్‌ స్టూడెంట్ల టిఫిన్​ కోసం రూ. 4 లక్షలు డొనేషన్

టెన్త్‌ స్టూడెంట్ల టిఫిన్​ కోసం రూ. 4 లక్షలు డొనేషన్

యాదాద్రి, వెలుగు: స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న టెన్త్‌ స్టూడెంట్లకు అల్పాహారం కోసం జిల్లా రైస్​ మిల్లర్స్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో రూ. 4 లక్షలు సాయం అందించారు.  రైస్​మిల్లర్లలో గంపా నాగేందర్​ రూ. లక్ష, పి నాగభూషణం రూ. 25 వేలు, మిగిలిన మిల్లర్లు రూ. 2.75 లక్షలు కలిసి మొత్తం రూ.4 లక్షలను గురువారం  కలెక్టర్​ హనుమంతు కే.జెండగేకు అందించారు.  

ఈ  కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​రావు, డీఈవో కే నారాయణ రెడ్డి, సివిల్​ సప్లయ్​ డీఎం గోపికృష్ణ, డీసీఎస్​వో శ్రీనివాసరెడ్డి, రైస్​ మిలర్ల తరఫున నాగభూషణం పాల్గొన్నారు.

Also read : కలెక్టర్​ను కలిసిన ఛాంబర్​ఆఫ్​ కామర్స్​ ప్రతినిధులు