శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లో ఇద్దరు, షోపియాన్ జిల్లాలో మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని హర్దుమీర్లో సెక్యూరిటీ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడగా సెక్యూరిటీ దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అంతకుముందు షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టెర్రరిస్టులు ఇద్దరు హతమయ్యారు. మృతులను బ్రారిపొరా ప్రాంతానికి చెందిన సాజద్ అహ్మద్ చాక్, పుల్వామాలోని అచన్ లిట్టర్కు చెందిన రాజా బాసిత్ యాకూబ్గా అధికారులు గుర్తించారు.