కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు టెర్రరిస్టుల హతం

కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లో ఇద్దరు, షోపియాన్ జిల్లాలో మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని హర్దుమీర్​లో సెక్యూరిటీ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడగా సెక్యూరిటీ దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అంతకుముందు షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తాయిబా టెర్రరిస్టులు ఇద్దరు హతమయ్యారు. మృతులను బ్రారిపొరా ప్రాంతానికి చెందిన సాజద్ అహ్మద్ చాక్, పుల్వామాలోని అచన్ లిట్టర్​కు చెందిన రాజా బాసిత్ యాకూబ్​గా అధికారులు గుర్తించారు.