షోపియాన్‌ ఎన్‌కౌంటర్.. 4 లష్కరే ఉగ్రవాదులు హతం

షోపియాన్‌ ఎన్‌కౌంటర్.. 4 లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు హతమయ్యారు. మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇవాళ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు.

విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అలర్టైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు... ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.