
- అస్వస్థతకు గురైన మరో15 ఆవులు
- ఖమ్మం రూరల్ మండలం
ఖమ్మం రూరల్, వెలుగు: బెండతోటలో మేతకు వెళ్లిన 40 మేకలు, బర్రె చనిపోగా.. మరో15 ఆవులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం రూరల్మండలం ఆరెకోడు తండాకు చెందిన రైతు గుగులోత్కృష్ణ తన బెండతోటకు రెండు రోజుల కింద పురుగుల మందు కొట్టాడు. సమ్మర్ కావడంతో రైతులు తమ పశువులను కాయకుండా వదిలిపెడుతుండగా.. శనివారం ఓ రైతు బర్రె తోటలో మేసి మృతి చెందింది. రైతులు మాలోత్ కృష్ణ, గోపి, బావుసింగ్, శంకర్, రాములు, హరిబాబు, సాంప్ల, రాజ్కుమార్, హరికి చెందిన సుమారు 300 మేకలు, 15 ఆవులను తోటలో మేత మేశాయి.
ఇందులో 40 మేకలు మృతి చెందాయి. ఇంకో 150 పశువులు అస్వస్థతకు గురవడంతో రైతులు వెంటనే ఖమ్మం సిటీలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చికిత్స చేశారు. ఆదివారం వెటర్నరీ డాక్టర్ హరీశ్ తండాకు వెళ్లి అస్వస్థలకు గురైన పశువులకు చికిత్స చేశారు. భారీగా మేకలు మృతి చెందడంతో బాధిత రైతులు బోరున విలపించారు. సుమారు రూ. 6 లక్షల వరకు నష్టపోయామని వాపోయారు.