ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో రష్యా దళాలు వీధి పోరాటం చేస్తున్నాయి. దీంతో ఎపుడు ఏమౌతుందోనన్న టెన్షన్ ఏర్పడుతోంది. దీంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో తమ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వివ్లోని డాన్లొ హాలిస్కయ్ మెడికల్ యూనివర్సిటీ కి చెందిన 40 మంది విద్యార్థులు పోలండ్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. పోలెండ్ సరిహద్దు నుంచి ఈ నగరం 70 కి.మీ. దూరంలో ఉంది. యూనివర్సిటీ అధికారులు 40 మంది మెడికల్ విద్యార్థులను బస్సులో తీసుకు వచ్చి సరిహద్దు దగ్గర దింపారు. అక్కడి నుంచి 8 కి.మీ. నడుచుకుంటూ విద్యార్థులు పోలండ్ సరిహద్దుకు చేరుకున్నారు.
మరో వైపు ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం రెండు విమానాలను పంపుతోంది. ఒకటి ఢిల్లీ నుంచి, మరోటి ముంబై నుంచి ఈ రాత్రి 9 గంటలకు బయలుదేరనున్నాయి.
మరిన్ని వార్తల కోసం...
