ఒక్కరోజే 41,322 కేసులు..41,452 రికవరీ

ఒక్కరోజే 41,322 కేసులు..41,452 రికవరీ

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 41 వేల 322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 93 లక్షల 51వేల 110 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 485 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 36 వేల 200కు చేరింది. నిన్న మరో 41 వేయి 452 కోలుకోవడంతో ఇప్పటి వరకూ 87 లక్షల 59 వేల 969  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 54 వేల 940యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 11 లక్షల 57 వేల 605 టెస్టులు చేశారు.