ఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు
  • ముగ్గురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8388 మంది శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా.. 43 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో శనివారానికి మొత్తంపాజిటివ్‌ కేసుల సంఖ్య 1930కి చేరినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. వ్యాధి సోకడంతో ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు. 999 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుండగా.. 887 మంది డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు చెప్పారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఒకరు చనిపోయారని అధికారులు చెప్పారు. తూర్పు గోవావరి, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గడిచిన 24 గంట్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

జిల్లాల వారీగా వివరాలు