ఏపీలో 44 కొత్త కేసులు నమోదు

ఏపీలో 44 కొత్త కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసులు 2,671కి చేరుకున్నాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటలలో  వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56గా ప్రకటించింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 10,240 మంది శాంపిల్స్ టెస్ట్ చేశామని తెలిపింది. వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారని తెలిపింది. దీంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 1,841 కి పెరిగింది. ఇంకా 767 మంది కరోనా ట్రీట్​మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది.

For More News..

విషాహారం తిని కుటుంబం ఆత్మహత్య

మాస్క్​ అవసరం కాదు.. అలవాటైపోయింది

64 మందితో 24గంటల సర్జరీ