పోలీసుల అదుపులో 44 మంది మహిళలు

పోలీసుల అదుపులో 44 మంది మహిళలు

తప్పుడు వీసాలతో వేరే దేశానికి వెళ్లడానికి ప్రయత్నించిన 44 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొంతమంది మహిళలు కువైట్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి వీసాలను పరిశీలించగా.. అవి నకిలీ వీసాలని తేలడంతో వెంటనే వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. వారికి వీసాలు ఎక్కడి నుంచి వచ్చాయో అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.