24 గంటల్లో 45,209 కేసులు..501 మరణాలు

24 గంటల్లో 45,209 కేసులు..501 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  కొత్తగా 45 వేల 209 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 90 లక్షల 95 వేల 807 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 501 మంది చనిపోగా… మొత్తం మరణాల సంఖ్య లక్షా 33 వేల 227 కు చేరింది. నిన్న మరో 43 వేల 493 కోలుకోగా.. ఇప్పటి వరకూ 85 లక్షల 21 వేల617 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 40 వేల 962 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10 లక్షల 75 వేల 326 టెస్టులు చేయగా… ఇప్పటి వరకూ దేశంలో 13 కోట్ల 17 లక్షల 33 వేల 134 మంది శాంపిల్స్ పరీక్షించారు.