ఒక్కరోజే 45,903 కేసులు..490 మరణాలు

ఒక్కరోజే 45,903 కేసులు..490 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య85,53,657 కు చేరగా..మరణాల సంఖ్య 1,26,611 కు చేరింది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 48,405 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో మొత్తం 79,17,373 కు చేరింది. ఇంకా 5,09,673 మంది ఆస్పత్రిలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 8,35,401 మందికి టెస్టులు చేశారు. మొత్తం నవంబర్ 8 వరకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులు 11 కోట్ల 85 లక్షల 72 వేల192 కే చేరాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

ఇక నుంచి రాయల్ ఎన్‌‌ఫీల్డ్ నుంచి 3 నెలలకో కొత్త బైక్..