
దేశంలో కొత్తగా 46 వేల 232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 90 లక్షల 50 వేలు దాటింది. ఇప్పటి వరకూ 84 లక్షల 78 వేల మంది కరోనా నుంచి కోలుకోగా…4 లక్షల 39 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న దేశవ్యాప్తంగా 564 మంది చనిపోగా… మొత్తం మరణాల సంఖ్య లక్షా 32 వేలు దాటింది. నిన్న దేశ వ్యాప్తంగా పది లక్షల 66 వేలకు పైగా టెస్టులు చేయగా… ఇప్పటి వరకూ 13 కోట్ల 6 లక్షల 57 వేల మంది శాంపిల్స్ పరీక్షించారు.