న్యూఢిల్లీ: టర్నోవర్ రూ. 62,476 కోట్లలో సగాన్ని చైనాకు వీవో కంపెనీ పంపేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడానికే వీవో ఈ విధంగా చేసిందని ఈడీ తెలిపింది. వీవో కంపెనీకి చెందిన 119 బ్యాంకు అకౌంట్లలోని రూ. 465 కోట్ల మొత్తాన్ని, రూ. 73 లక్షల నగదును, 2 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 5 న వీవో మొబైల్ ఇండియాతోపాటు, మరో 23 అసోసియేట్ కంపెనీలపైనా ఈడీ దాడులు జరిపిన విషయం తెలిసిందే.