దేశంలో కొత్త‌గా 47,905 క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 47,905 క‌రోనా కేసులు

దేశంలో కరోనా  కేసులు పెరుగుతూనే  ఉన్నాయి.  24  గంటల్లో   47 వేల 95 కేసులు నమోదయ్యాయి. దీంతో  దేశంలో మొత్తం  కేసుల సంఖ్య  86 లక్షల 83 వేల 917కు చేరాయి. గత 24 గంట్లో   550 మంది ప్రాణాలు  కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 28 వేల 121కి చేరింది. దేశంలో ప్రస్తుతం 4 లక్షల 89  వేల 294 యాక్టీవ్ కేసులున్నాయి.

దేశరాజధాని ఢిల్లీన ి కరోనా వైరస్  భయపెడుతోంది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో  రికార్డు స్థాయిలో  8 వేలకు పైగా  కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజున   8 వేల 5 వందల 93 మందికి  కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు  కూడా ఈ స్థాయిలో  కేసులు నమోదు  కాలేదు. కొన్ని రోజులుగా అక్కడ కేసులు క్రమంగా పెరుగుతూనే  ఉన్నాయి. మంగళవారం  రోజున ఢిల్లీలో 7 వేల 8  వందల 30 కేసులు నమోదయ్యాయి. సోమవారం  రోజున 5 వేల  23 కేసులు వచ్చినట్టు  ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు  4 లక్షల 59 వేల  975 కేసులు నమోదయ్యాయి.