ఫ్లోరిడా: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక ‘రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్’లో 48 మందికి కరోనా సోకింది. దీంతో షిప్ను శనివారం ఫ్లోరిడాలోని మయామి పోర్ట్లో ఆపేశారు. ఈ షిప్లో స్టాఫ్, ప్యాసింజర్లతో కలిపి మొత్తం 6,091 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరినీ క్వారంటైన్కు తరలించినట్లు షిప్ ప్రతినిధులు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వాళ్లలో కొంతమందిలో లక్షణాలు కనిపించట్లేదని, ఇంకొంతమందిలో మైల్డ్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఒక ప్యాసింజర్ కు జబ్బు చేస్తే కరోనా టెస్ట్ చేశామని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని వివరించారు. వెంటనే ఆమెను ఐసోలేట్ చేసి, ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. షిప్లో ఉన్నోళ్లు అందరికీ టెస్టులు చేయగా, 48 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
