తోటి జవాన్లపై కాల్పులు.. ఐదుగురు మృతి

తోటి జవాన్లపై కాల్పులు.. ఐదుగురు మృతి

ఓ జవాను తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా…మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. నారాయణ పూర్ లోని ITBP 45వ బటాలియన్ శిబిరంలోని రెహమాన్ అనే జవాన్ సహచర జవాన్లపై సర్వీసు తుపాకీతో కాల్పులు జరిపాడు. తర్వాత గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే రెహమాన్ ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు.