క్లోరోహైడ్రెట్​ పట్టివేత : రూప్​సింగ్

 క్లోరోహైడ్రెట్​ పట్టివేత :  రూప్​సింగ్

బోధన్, వెలుగు:  పట్టణంలోని గవర్నమెంట్ డీగ్రీ కాలేజీ ఆవరణలో  క్లోరోహైడ్రెట్​ను ఎక్సైజ్​ సీఐ రూప్​సింగ్​ పట్టుకున్నారు.  తమకు అందిన సమాచారంతో క్లోరోహైడ్రెట్​ను సరఫరా చేస్తున్నా బోధన్​ మండలం బర్దిపూర్​కు చెందిన గున్నాల జగదీశ్​గౌడ్​, రాకాసిపేట్ కు చెందిన శేకవార్ శంకర్​గౌడ్, ఎడపల్లి మండలం కుర్నాపల్లికి  చెందిన నిమ్మపల్లి నగేశ్ గౌడ్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Also Read : గుడ్ న్యూస్ : రైతులకు మరో రూ.2 వేలు ఇవ్వటానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు

వారి వద్ద నుంచి 5 కిలోల క్లోరోహైడ్రెట్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ.25వేల విలువ ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు  పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్​ఎస్సై బాలయ్య, కానిస్టేబుళ్లు చంద్రశేకర్, శ్రీనివాస్​, ప్రమోద్​, సంజీవ్​  ఉన్నారు.