ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనం

ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనం

అస్సాంలో దారుణం జరిగింది. దిమా హసావ్ జిల్లాలో ట్రక్కులకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. దిమా హసావ్ జిల్లాలోని రంగేర్ బీల్ దగ్గర ఇది ఘోరం జరిగింది. దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన తీవ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట ట్రక్కు డ్రైవర్లు, అక్కడున్న ప్రజలపై కాల్పులు జరిపారు తీవ్రవాదులు. తర్వాత ట్రక్కులను తగలబెట్టారు. మొత్తం 7 ట్రక్కులు కాలి బూడిదయ్యాయి. గౌహతి సిటీకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో... పోలీసులు అలర్ట్ అయ్యారు. అస్సాం పోలీసులతో పాటు... ఇండియన్ ఆర్మీకి చెందిన అస్సాం రైఫిల్స్ యూనిట్ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుపుతున్నాయి.