దుర్గా హారతితో చెలరేగిన మంటలు.. ఐదుగురు మృతి

 దుర్గా హారతితో చెలరేగిన మంటలు.. ఐదుగురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో దుర్గా మండపంలో మంటలు అంటుకొని ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు దుర్గా పూజ అనంతరం హారతి ఇస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు భదోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను పరిసర ప్రాంత ప్రజలు హుటాహుటిన సమీపంలోని  ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

ఈ ఘటనకు కారణం షార్ట్ సర్క్యూటేనని డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ గౌరాంగ్ రాతి వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో దుర్గా మండపం చుట్టుపక్కల దాదాపు 150మంది ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 64 మందికిపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వీరికి 30 నుంచి 40 శాతం వరకు కాలిన గాయాలయ్యాయని, ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.