- 19 మందికి గాయాలు
- మహారాష్ట్ర నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం
భోపాల్: ట్రక్కు బోల్తా పడటంతో యూపీకి చెందిన ఐదుగురు వలస కూలీలు చనిపోయారు. 19 మందికి గాయాలయ్యాయి. వీరంతా మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ కు ట్రక్కులో బయల్దేరగా శనివారం ఉదయం మధ్యప్రదేశ్లోని సెమ్రా దగ్గర్లో ప్రమాదం జరిగిందని అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్పి) ప్రవీన్ భూరియా తెలిపారు. గాయపడిన వారందరినీ బండాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలన్నారని, వీరంతా యూపీలోని బస్తీ జిల్లాకు వెళ్తున్నారని చెప్పారు. కూలీలంతా క్లాత్ లోడ్ ఉన్న ట్రక్కు పైన కూర్చుని ప్రయాణిస్తున్నారని తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని, దర్యాప్తు చేపట్టామన్నారు.