స్కూల్ బస్సులో మంటలు.. కొద్దిలో బయటపడిన పిల్లలు

స్కూల్ బస్సులో మంటలు.. కొద్దిలో బయటపడిన పిల్లలు

ఐదుగురు విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.  అదృష్టవశాత్తూ విద్యార్థులంతా తృటిలో బస్సు నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని తిరుగుటలో జరిగింది. 2023 జూన్ 28  బుధవారం ఉదయం 8 గంటలకు బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  

మంటలు ఎగిసిపడుతుండటాన్ని గమనించిన బాటసారులు డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన  డ్రైవర్‌ బస్సు దగ్ధం కాకముందే బస్సులో కూర్చున్న విద్యార్థులందరినీ బయటకు దించాడు.  

సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అర్పాయి.  అయితే  బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యార్థులంతా సేఫ్ గా బయటపడటంతో స్కూల్ యాజామాన్యంతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు.