జర్నలిస్టు పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ

జర్నలిస్టు పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ

హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 2023-24 3 విద్యాసంవత్సరానికి ఫీజులో 50శాతం రాయితీ కల్పిస్తూ డీఈవో ఆర్.రోహిణి  ఉత్వర్వులు జారీచేశారు. 2023–24 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి హైదరాబాద్ లోని ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈమేరకు  డిప్యూటీ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్,  డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూళ్లకు సర్య్కులర్ జారీ చేశారు. 

ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇప్పించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే– టీడబ్ల్యూజేఎఫ్​) ప్రతినిధులు  జూన్ 2వ తేదీన విద్యాశాఖ అధికారులను కోరారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో డీఈవో ఆర్. రోహిణిని హెచ్​యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ్​కుమార్, బి.జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, వైస్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి, శ్రీధర్  కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిలో పిల్లలను చదివిస్తున్న పేద, మధ్యతరగతికి చెందిన జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారి పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని డీఈవోకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల  విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న  డీఈవో రోహిణి.. 2023-24 3 విద్యాసంవత్సరానికి ఫీజులో 50శాతం రాయితీ కల్పిస్తూ  ఉత్వర్వులు జారీ చేశారు.