డీఈ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా

డీఈ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా

ఏఈలు, సిబ్బంది కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున..

కుటుంబానికో ఉద్యోగం: సీఎం KCR

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆఫీసర్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మొత్తం 9 మంది మరణించగా.. వారిలో ఒక డీఈ, ఏఈలు, కాం ట్రాక్టు సిబ్బంది, అటెండర్లు ఉన్నారు. డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం శుక్రవారం ఒక ప్రకనటలో తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు శాఖా పరమైన ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు.