గుజరాత్ లో భూకంపం

గుజరాత్ లో భూకంపం

గుజరాత్‌లోని ద్వారకలో ఇవాళ( గురువారం) భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.0 గా నమోదైంది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు  జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (SCS) తెలిపింది. ద్వారకకు వాయువ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతులో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.