- రెండు కార్లపై నిలబడి సాహనం
దామోహ్: సింగం సినిమాలో హీరో అజయ్ దేవగణ్ చేసిన స్టంట్ను అనుకరించిన మధ్యప్రదేశ్కు చెందిన పోలీసుకు రూ.5000 ఫైన్ వేశారు. మరోసారి ఇలా చేయొద్దని, తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దామోహ్ జిల్లా నార్సింగ్గర్హ ఎస్సై మనోజ్ యాదవ్ సింగం సినిమాలో అజయ్ దేవగణ్ రెండు కార్లపై ఒకేసారి ప్రయణించిన స్టంట్ను చేశాడు. యూనిఫాం వేసుకుని కార్లపై నిలబడి స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికారులు దానిపై విచారణ జరిపి రూ.5వేలు ఫైన్ విధించారు. ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని, యువతపై ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ హెచ్చరించారు.