511కు పెరిగిన జేఎన్‌‌‌‌.1 కేసులు

511కు పెరిగిన జేఎన్‌‌‌‌.1 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్‌‌‌‌ వేరియంట్‌‌‌‌ జేఎన్‌‌‌‌.1 కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 511కు పెరిగిందని హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కర్నాటకలో 199 జేఎన్‌‌‌‌.1 కేసులు నమోదయ్యాయి. తర్వాత కేరళ 148, గోవా 48, గుజరాత్‌‌‌‌ 36, మహారాష్ట్ర 32, తమిళనాడు 26, ఢిల్లీ 15, రాజస్థాన్ 4, తెలంగాణ 2, ఒడిశా, హర్యానాలో ఒక కేసు చొప్పున రికార్డయ్యాయి.

ఈ వేరియంట్‌‌‌‌ వ్యాప్తి స్పీడ్‌‌‌‌గా ఉంటుందని, అయితే, ప్రాణాలకు ముప్పు తక్కువని డబ్ల్యూహెచ్‌‌‌‌వో అధికారులు వెల్లడించారు. మరోవైపు, దేశంలో కొత్తగా 602 కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు.