24 గంటల్లో 52,123 కేసులు..775 మరణాలు

24 గంటల్లో 52,123 కేసులు..775 మరణాలు

దేశంలో కరోనా కేసులు,మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి.  రోజుకు దాదాపు 50 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 52,123 కేసులు నమోదు, 775 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా సంఖ్య కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,83,792 కు చేరగా.. 34,968 మంది మృతి చెందారు. ఇందులో  5,28,242 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. 10,20,582 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 32,553 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 64.44 శాతం ఉండగా మరణాల రేటు 2.21 గా ఉంది. 29న 4,46,642 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా  జూలై 29 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 1,81,90,382 కు  చేరింది.