ఢిల్లీలో భూకంపం .. జమ్మూలోనూ ప్రకంపనలు

ఢిల్లీలో భూకంపం ..  జమ్మూలోనూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ తో పాటు  ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాల్లో 2023 జూన్ 13న మంగళవారం  భూకంపం  సంభవించింది.   మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం 10 సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్‌, పంజాబ్‌లో ప్రకంపనలు వచ్చాయి. 10 సెకన్ల పాటు  భూమి కంపించింది. 

దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో రిక్డర్డ్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0గా నమోదు కాగా,జమ్మూ కశ్మీర్ లో 5.7 గా నమోదైంది.  అయితే భూకంపం దాటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.   

భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.