- హోంమంత్రి అమిత్ షా హాజరు
జైపూర్ : జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఆలిండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డీజీపీ ఐజీపీ) సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రులు అజయ్ కుమార్ మిశ్రా, నిసిత్ ప్రమాణిక్, అధికారులతో కలిసి హాజరయ్యారు.
పారామిలటరీ బలగాలతో పాటు దర్యాప్తు సంస్థల హెడ్లు, వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. నేరస్తుల నెట్వర్క్లు పెరగడం, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, పోలీసింగ్లో సాంకేతికత, టెర్రరిజంలో సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, జైళ్ల సంస్కరణలు వంటి అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది.