టెంపుల్‌‌ టౌన్‌‌లో రూ. 4.5 కోట్ల పాత నోట్లు

టెంపుల్‌‌ టౌన్‌‌లో రూ. 4.5 కోట్ల పాత నోట్లు
  • హరిద్వార్​లో4.5 కోట్ల పాత నోట్లు దొరికినయ్‌‌
  • ఉత్తరాఖండ్‌‌లో ఆరుగురి అరెస్ట్‌‌

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌‌లోని టెంపుల్‌‌ టౌన్‌‌లో స్పెషల్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ (ఎస్‌‌టీఎఫ్‌‌) అధికారులు శనివారం చేపట్టిన సోదాల్లో రూ.4.5 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్‌‌టీఎఫ్‌‌ ఎస్పీ అజయ్‌‌ సింగ్‌‌ తెలిపారు. వీరిలో ముగ్గురిని హరిద్వార్‌‌‌‌లో, మిగతా ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌‌లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ పాత నోట్లను బ్యాంకులో మార్చుకుంటామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2016 నవంబర్‌‌‌‌ 8న పాత రూ.500, రూ.1,000 నోట్లను బ్యాన్‌‌ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అలాగే ధర్మ సంసద్‌‌ నాయకుడు నర్సింగానంద్‌‌ను శనివారం అరెస్ట్‌‌ చేశారు. గత వారం హరిద్వార్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై  ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.