అట్టహాసంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

అట్టహాసంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: దేశ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సోమవారం జరుగుతోంది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజేతలకు అవార్డులు అందజేశారు. మిగిలిన అవార్డు గ్రహీతలకు పురస్కారాల ప్రదాన కార్యక్రమం కొనసాగుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు విశిష్ట అవార్డు వరించింది. మూవీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన అందుకోనున్నారు.