2026లో 68 మంది ఇంజనీర్లు రిటైర్..జనవరి 31న ఈఎన్సీ పదవీ విరమణ

2026లో 68 మంది ఇంజనీర్లు రిటైర్..జనవరి 31న ఈఎన్సీ పదవీ విరమణ

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ ఖాళీ అవుతున్నది. ఇప్పటికే చాలా మంది కీలక అధికారులు రిటైరైయి వెళ్లిపోగా.. చాలా వరకు పోస్టులు ఖాళీ అవుతున్నాయి. మరోసారి కొత్త సంవత్సరం 2026లోనూ భారీగా అధికారులు రిటైర్​కాబోతున్నారు. 68 మంది ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయబోతున్నారు.

 ఈఎన్సీ జనరల్​అంజద్​హుస్సేన్​సహా11 మంది సీఈలు కూడా రిటైర్​కానున్నారు. జనవరి 31న ఈఎన్సీ జనరల్​రిటైర్​అవబోతున్నారు. అంతేగాకుండా 9 మంది ఎస్ఈలు, 30 మంది ఈఈలు, 17 మంది డీఈఈలు పదవీ విరమణ చేయబోతున్నారు.