బ్లాక్ స్పాట్స్ వద్ద కబ్జాలు తొలగించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

బ్లాక్ స్పాట్స్ వద్ద కబ్జాలు తొలగించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్​,  వెలుగు:  జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న  బ్లాక్​ స్పాట్స్​ వద్ద ఆక్రమణల తొలగించాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం నగర శివారులోని బ్లాక్​ స్పాట్స్​ను పరిశీలించి మాట్లాడారు.  మూలమలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, వంకర టింకర నిర్మాణాలను సరిచేయాలన్నారు. రోడ్ల మధ్య కరెంట్ పోల్స్ ఉంటే తొలగించాలన్నారు. యాక్సిడెంట్స్ జరిగే ప్రాంతాల్లో సైన్​ బోర్డులు పెట్టాలన్నారు. ఆర్టీసీ బస్​ డ్రైవర్లు, ప్రైవేట్ వెహికల్స్,​ ఆపరేటర్లు రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా స్టేట్​లో 20వ స్థానంలో ఉందని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అడిషనల్​కలెక్టర్ అంకిత్​, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐ శ్రీనివాస్, ఆర్​అండ్​బీ ఇంజినీర్​ ప్రవీణ్​, హర్ష తదితరులు ఉన్నారు. తరువాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రోడ్​ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు. 

డీసీసీబీలో కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్​,  వెలుగు:  జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పర్సన్​ ఇన్​చార్జిగా కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి శనివారం చార్జ్​ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించగా బ్యాంక్​ సీఈవో నాగభూషణం వందే పూలబొకేతో స్వాగతం పలికారు.