బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆచన్ పల్లిలోని దీపక్ స్వీట్ హోంలో తనిఖీ చేయగా15 సిలిండర్లు, చాందిని దాబాపై దాడి చేయగా 3 సిలిండర్లు దొరికాయి. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్సిలిండర్లు వినియోగించడంతో హోటల్ ఓనర్లపై కేసు నమోదు చేసి సిలిండర్లను సీజ్ చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు హన్మంతు, పవన్ తెలిపారు.
నిర్మల్ పట్టణంలో..
నిర్మల్: నిర్మల్ పట్టణంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా గృహావసరాలకు కేటాయించిన 29 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
