ఒక్కరోజే 69,652 కేసులు..977 మంది మృతి

ఒక్కరోజే 69,652 కేసులు..977 మంది మృతి

 

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 65 వేల కరోనా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కరోనా కేసులు నమోదయ్యాయి.   దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,926 కుచేరింది. నిన్న మరో 977 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 53,866 కు చేరింది.

దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 20,96,665 మంది కోలుకున్నారు. ఇంకా 6,86,395 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నిన్న(ఆగస్టు 19న) ఒక్కరోజే దేశంలో 9 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశారని చెప్పింది.