OMG : ఇంజక్షన్ వికటించి ఏడుగురు పిల్లలకు తీవ్ర అస్వస్థత

OMG : ఇంజక్షన్ వికటించి ఏడుగురు పిల్లలకు తీవ్ర అస్వస్థత

ఇంజక్షన్ వికటించి పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో మొత్తం 15 మంది చిన్నారులు వైద్యం పొందుతున్నారు.  ఈ క్రమంలో రోజూ మాదిరిగానే వైద్యం పొందుతున్న చిన్నారులకు శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు.

ఇంజక్షన్ చేసిన అర గంటకు  విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also read :  తెలంగాణ బడ్జెట్ అప్ డేట్స్