నిద్రపోతున్న భక్తులపై నుంచి దూస్కెళ్లిన బస్సు: ఏడుగురి మృతి

నిద్రపోతున్న భక్తులపై నుంచి దూస్కెళ్లిన బస్సు: ఏడుగురి మృతి

సూర్యోదయం సమయంలో నదిలో పుణ్య స్నానాలు ఆచరించాలని భావించి, రాత్రి సమయంలో అక్కడే నిద్రించారు కొంత మంది భక్తులు. అయితే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ సమీపంలో గంగా నది ఒడ్డున నౌరౌరా ఘాట్ దగ్గర ఇవాళ తెల్లవారుజామున జరిగింది. నదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు తీరంలోని రోడ్డుపక్కగా నిద్రిస్తుండగా, వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వస్తున్న బస్సు అదుపుతప్పి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు. ప్రమాదం తర్వాత బస్సును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.