24 గంటల్లో 73,272 కేసులు..926 మరణాలు

24 గంటల్లో 73,272 కేసులు..926 మరణాలు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,272 కరోనా కేసులు నమోదవ్వగా 926 మంది చనిపోయారు. దీందో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 69 లక్షల 79 వేల 424 కు చేరగా..మరణాల సంఖ్య 1,07,416 కు చేరింది. నిన్న ఒక్కరోజే 82,753 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 59లక్షల 88 వేల 823 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఇంకా 8లక్షల 83 వేల 185 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 11 లక్షల 64 వేల 018 శాంపిల్స్ టెస్టు చేశారు. వీటితో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 9 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 8 కోట్ల57లక్షల,98 వేల 698 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.