యూఏఈలో మనోడికి 7.45 కోట్ల లాటరీ

యూఏఈలో మనోడికి 7.45 కోట్ల లాటరీ

దుబాయ్: యూఏఈలో మనోడిని అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ఏకంగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.7.45 కోట్లు) గెలుచుకున్నాడు. మహారాష్ట్రలోని థానేకు చెందిన గణేశ్ షిండే(36) జూన్ 16న దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ఫైనెస్ట్ సర్​ఫ్రైజ్ డ్రా అధికారిక వెబ్ సైట్ నుంచి జాక్ పాట్ టికెట్ కొన్నాడు. షిండే ఓ బ్రెజిలియన్ నేవీ కంపెనీలో పనిచేస్తున్నాడు. దుబాయ్ నుంచి రియో డీ జనీరో మధ్య రాకపోకల కోసం దుబాయ్​లో వెయిట్ చేస్తుండేవాడు.ఈ క్రమంలోనే రెండేండ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నట్లు షిండే చెప్పారు. ‘లాటరీ గెలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇది చాలా గొప్ప అవకాశం. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్.. తొందర్లోనే అక్కడికి పోతా.. గెలుచుకున్న డబ్బుతో కారు, బంగ్లా కొంటా.. పిల్లలను మంచిగా చదివిస్తా’ అని షిండే చెప్పారు. మిలీనియం మిలియనీర్ లక్కీ డ్రా 1999లో మొదలైంది. ఈ డ్రా గెలుచుకున్నోళ్లలో షిండే 181వ ఇండియన్.. ఈ కాంటెస్ట్లో ​టికెట్ కొనేవాళ్లలో కూడా ఎక్కువ మంది ఇండియన్లే.