స్కూలు పైకప్పు కూలి విద్యార్థి మృతి

స్కూలు పైకప్పు కూలి విద్యార్థి మృతి
  • ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ఘటన

ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం రాజుపాలెంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలుకు సెలవు దినం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా పై కప్పు కూలడంతో స్కూలులో ఆడుకుంటున్న విష్ణు అనే 7వ తరగతి బాలుడు చనిపోయాడు. విష్ణు ప్రైవేటు స్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సెలవు రోజు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన తోటి పిల్లలంతా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆడుకుంటూ ఉంటారు. ఇదే కోవలో విష్ణు ఆదివారం స్కూలుకు వెళ్లి తరగతి గదిలో ఒక్కడే ఉన్న సమయంలో పైకప్పు కూలింది. చుట్టుపక్కల ఆడుకుంటున్న పిల్లలు, పెద్దలు వచ్చి గమనించేలోగా తీవ్ర గాయాలతో కన్నుమూశాడు.  విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.