గోవధకు పాల్పడిన 8 మంది అరెస్ట్

గోవధకు పాల్పడిన 8 మంది అరెస్ట్

గోవధకు పాల్పడిన 8 మందిని అరెస్ట్ చేశారు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు. సిరిసిల్ల బైపాస్ రోడ్ లో ఇటుక బట్టీల వెనుక ఉన్న రేకుల షెడ్లలో గోవధ చేశారనే పక్కా సమాచారంతో దాడులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకుని చంపిన ఆవులను పరిశీలించి, షెడ్డులో కట్టేసిన ఆవులను గోశాలకు పంపించారు. గోవధపై హిందూ సంఘాలు, గో రక్షణ సమితి నేతలు ఆందోళనకు దిగడంతో.. వారికి సర్ది చెప్పారు. గోవధను తీవ్రంగా ఖండించారు మంత్రి హరీశ్ రావు. గోవధ హేయమైన చర్య అని.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. గోవధశాల దగ్గర ఆవులను సంరక్షించాలని సూచించారు.