రాక్షస తండ్రి: 8నెలల కొడుకును గుద్ది చంపేశాడు

రాక్షస తండ్రి: 8నెలల కొడుకును గుద్ది చంపేశాడు

మానవత్వం మరచిన ఓ కన్న తండ్రి తన 8నెలల కొడుకును పిడిగుద్దులు గుద్ది చంపేశాడు. ఈ ధారుణమైన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి 34 ఏళ్ల క్రిస్టోఫర్ అతని కుటుంబంతో కలిసి టెక్సాస్ లో నివసిస్తున్నాడు. అతనికి 8 నెలల క్రితం ఓ మగ బిడ్డ పుట్టాడు. ఆతరువాత 6 నెలలకు అతని భార్య ఉద్యోగానికి వెళ్లడం స్టార్ట్ చేసింది. దీంతో పిలగాన్ని చూసుకునే బాధ్యత.. ఇంట్లోనే ఉంటున్న..  క్రిస్టోఫర్, అతని తల్లి, చెల్లెలిపై పడింది. రెండు నెలల పాటు బాబును బాగానే చూసుకున్న వాళ్లు.. ఆతర్వాత నుంచి పిల్లాన్ని భరించలేకపోయారు. పాల కోసం ఏడ్చినా.. విసిగించినా బాబును కొట్టడం స్టార్ట్ చేశారు. ఇందుకు క్రిస్టఫర్ కు అతని తల్లి, చెల్లెలు కూడా తోడయ్యారు. ఇందులో భాగంగా.. ఏదో ఒక విషయంలో బాబు విసిగించే సరికి.. 8నెలల పసికందుపై పిడిగుద్దులు కురిపించాడు క్రిస్టఫర్. పిల్లాన్ని కొట్టి చంపుతుంటే.. అతనికి తల్లి, చెల్లేలు కూడా అడ్డు చెప్పలేదని పోలీసులు చెప్పారు.

బాబును చంపేశాక ఓ స్కూల్ బ్యాగులో పిల్లాడి శవాన్ని కుక్కి పొలంలో పడేశాడు క్రిస్టపర్. ఆ తర్వాత తన కొడుకును ఎవరో కిడ్నాప్  చేసారని  పోలీస్ కంప్లేంట్ ఇచ్చాడు. పొలంలో పని చేయడానికి వెళ్లిన పనివాళ్లకు అనుమానాస్పదంగా బ్యాగు కనపడింది. దీంతో పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బ్యాగులో ఉన్న పసికందును చూడగా.. ఆపిల్లాడు పిడిగుద్దులతో నలిగిపోయి ఉన్నాడని పోలీసులు మీడియాకు చెప్పారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని కనుగొన్నారు. పిల్లాన్ని చంపిన.. క్రిస్టఫర్ ను..  అతని తల్లిని, చెల్లెలిని కూడా అరెస్టు చేశారు పోలీసులు.