యూపీలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

యూపీలో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

మహారాజ్‌గంజ్(యూపీ): ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన యూపీ మహారాజ్ గంజ్ లోని కొల్హి ప్రాంతంలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని.. విక్రమ్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ప పోలీసులు తెలిపారు. బాలిక ఇంటి దగ్గర్లో నివాసం ఉండే విక్రమ్.. చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఉదయానికల్లా బాలిక అనారోగ్యానికి గురికావడంతో విషయం బయటపడిందని, తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బాలికపై గ్యాంగ్​రేప్
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన నిందితులను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరొకరిని పట్టుకుంటామని టోంక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. మంగళవారం పొలం పనులకు వెళ్తున్న బాలికను నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్​కి పాల్పడ్డారని, బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఆస్పత్రికి తరలించామని చెప్పారు.