ఒక్కరోజే 80,472 కేసులు..1179 మరణాలు

ఒక్కరోజే 80,472 కేసులు..1179 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 80,472 కేసులు నమోదవ్వగా 1179 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,25,764 కు చేరగా మరణాల సంఖ్య 97,497 కు చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 86,428 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 51,87,826 కు చేరింది. ఇంకా 9,40,441 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక దేశంలో మరణాల రేటు 1.57, రికవరీ రేటు 83.33గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నిన్న ఒక్కరోజే   10,86,688 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 29 వరకు 7,41,96,729 టెస్టులు చేశారని ఐసీఎంఆర్ ప్రకటించింది.

నేను లోకల్​లో ఉంటున్నా…మీరూ ఉండాలె