భారత్ లో 49 లక్షలు దాటిన కేసులు..80 వేలు దాటిన మరణాలు

భారత్ లో 49 లక్షలు దాటిన కేసులు..80 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా  ఉదృతి కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 83,809 కేసులు నమోదవ్వగా మరో 1054 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 49,30,237 కు చేరగా..మరణాల సంఖ్య 80,776కు చేరింది. 38,59,400 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,90,061 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 10,72,845 మందికి టెస్టులు చేశారు. వీటితో కలిపి సెప్టెంబర్ 14 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 5,83,12,273 చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.