
తెలంగాణలో గత 24 గంటల్లో 922 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షల 40 వేల 970 కి చేరాయి. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1348కి చేరింది. నిన్నఒక్కరోజే 1456 మంది కోలుకున్నారు. మొత్తం 2 లక్షల 21 వేల 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 256 కేసులు నమోదయ్యాయి.