ఏపీలో కరోనా విజృంభణ.. ఆ నాలుగు జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ నాలుగు జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు

ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో  8,97,810 మంది వైరస్‌ బారినపడ్డారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని తెలిపింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,203గా ఉంది. 24 గంటల్లో 377 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,85,892కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 1,49,58,897 కు చేరింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 180.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.