
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059 కు చేరాయి. నిన్న మరో నలుగురు చనిపోయారు. మొత్తం నిన్నటి వరకు కరోనా మరణాల సంఖ్య 1275 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి1896 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 2,00,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 21,091 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 212 కేసులు నమోదయ్యాయి.