
హైదరాబాద్, వెలుగు: ఎడ్ సెట్ ఫలితాల్లో 96.38శాతం మంది క్వాలిఫై అయ్యారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఎడ్ సెట్– 2025 ఫలితాలను టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి రిలీజ్ చేశారు. జూన్ 1న ఎడ్ సెట్ నిర్వహించారు. దీనికి 38,754 మంది రిజిస్టర్ చేసుకోగా, 32,106 మంది పరీక్ష రాశారు.30,944 (96.38%) మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో అబ్బాయిలు 5,723 మంది ఉండగా, అమ్మాయిలు 25,220 మంది ఉన్నారు.
గతేడాది రాష్ట్రంలో 208 బీఈడీ కాలేజీలు ఉండగా, 18,550 సీట్లు ఉన్నాయి. వాటిలో 14,420 సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, ఎడ్ సెట్ టాపర్గా హైదరాబాద్ కు చెందిన గణపతి శాస్త్రి (126 మార్కులు), రెండో ర్యాంకును హైదరాబాద్కు చెందిన శరత్ చంద్ర (121 మార్కులు), మూడో ర్యాంకు వరంగల్కు చెందిన నాగరాజు (121 మార్కులు) సాధించారు. కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.